హైదరాబాద్, ఆట ప్రతినిధి: గుజరాత్ వేదికగా జరుగుతున్న 34వ జాతీయ సబ్జూనియర్ సాఫ్ట్బాల్ చాంపియన్షిప్లో తెలంగాణ ఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన బాలికల సెమీఫైనల్ పోరులో తెలంగాణ 1-0 తేడాతో మహారాష్ట్రపై అద్భుత విజయం సాధించింది. శనివారం జరిగే ఫైనల్లో ఆంధ్రప్రదేశ్తో తెలంగాణ జట్టు తలపడుతుంది. అంతకుముందు జరిగిన సూపర్ లీగ్ మ్యాచ్ల్లో ఆంధ్రప్రదేశ్, చత్తీస్గఢ్, పంజాబ్, కర్ణాటకపై తెలంగాణ వరుస విజయాలు సాధించింది.