హైదరాబాద్, ఆట ప్రతినిధి: జాతీయ సబ్జూనియర్ సాఫ్ట్బాల్ చాంపియన్షిప్లో తెలంగాణ బాలికల జట్టు విజేతగా నిలిచింది. గుజరాత్లోని మెహ్మెదాబాద్ వేదికగా శనివారం జరిగిన ఫైనల్లో తెలంగాణ 7-1 తేడాతో ఆంధ్రప్రదేశ్ను చిత్తుచేసింది. సెమీఫైనల్లో మహారాష్ట్రపై విజయం సాధించి తుదిపోరుకు అర్హత సాధించిన తెలంగాణకు.. ఆంధ్ర అమ్మాయిలు ఏమా త్రం పోటీనివ్వలేకపోయారు. దీంతో పూర్తి ఆధిపత్యం కనబర్చిన తెలంగాణ బాలికలు పసిడి పతకం కైవసం చేసుకున్నారు. ఆంధ్ర జట్టు రన్నరప్ ట్రోఫీ దక్కిం చుకోగా.. మహారాష్ట్ర మూడో స్థానంలో నిలిచింది.