హైదరాబాద్, ఆట ప్రతినిధి: అమెరికాలోని కాన్సాస్ వేదికగా జరిగిన ఐటీఎఫ్ 35కే మహిళల టెన్నిస్ టోర్నమెంట్లో భారత నంబర్వన్ టెన్నిస్ ప్లేయర్, తెలంగాణ అమ్మాయి యమలపల్లి సహజ రన్నరప్గా నిలిచింది. హోరాహోరీగా సాగిన ఈ టోర్నీలో అద్భుత ప్రదర్శనతో ఫైనల్స్ చేరిన ఆమె సోమవారం జరిగిన తుదిపోరులో 4-6, 0-6తో అమెరికాకు చెందిన రీస్ బ్రాంట్మీర్తో చేతిలో ఓడిపోయింది.