హైదరాబాద్, ఫిబ్రవరి 5 (నమస్తే తెలంగాణ) : ఉదయ్పూర్(రాజస్థాన్)లో జరిగిన ఆలిండియా ఫైర్ సర్వీసెస్ స్పోర్ట్స్ మీట్లో తెలంగాణ ఫైర్ విభాగం ప్రతిభ చాటింది. మన రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహించిన 19 మంది సభ్యుల బృందం 3 విభాగాల్లో 3 పతకాలు సాధించింది. పతకాలు సాధించిన క్రీడాకారులను ఫైర్ డీజీ విక్రమ్సింగ్ మాన్ గురువారం అభినందించారు.
జనవరి 26 నుంచి 31వ తేదీ వరకు జరిగిన పోటీల్లో వరంగల్కు చెందిన ఫైర్ ఫైటర్ అశోక్ 40 వయసు విభాగ 5వేల మీటర పరుగులో కాంస్యంతో మెరిశాడు. అదే జోరు కొనసాగిస్తూ 1500మీటర్ల విభాగంలోనూ మరో కాంస్యం ఖాతాలో వేసుకున్నాడు. 30పై బడిన వయసు కేటగిరీలో వరంగల్ ఫైర్ఫైటర్ కుమారస్వామి 5000మీటర్ల రేసులో రజత పతకం సొంతం చేసుకున్నాడు. టోర్నీలో బ్యాడ్మింటన్, అథ్లెటిక్స్, షాట్పుట్, స్ట్రెయిట్న్,్ర లాంగ్జంప్ వంటి విభాగాల్లో తెలంగాణ ప్లేయర్లు సత్తాచాటారు.