తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఫిడె మాస్టర్ కంది రాము అరుదైన ఘనత సాధించాడు. సెర్బియాలో జరిగిన ఐఎం టోర్నమెంటులో సత్తా చాటి తొలి ఇంటన్నేషనల్ మాస్టర్ (ఐఎం) నార్మ్ సంపాదించుకున్నాడు. అరజెలోవాక్లో జరిగిన ఐఎం ఏఎస్కే-7 టోర్నమెంటులో ఈ అద్భుతం జరిగింది. నిజామాబాద్ జిల్లాలోని దోమకొండకు చెందిన కంది రాము..
ఈ టోర్నీలో ముగ్గురు గ్రాండ్ మాస్టర్లు, ముగ్గురు ఇంటర్నేషనల్ మాస్టర్లను ఓడించాడు. పది రౌండ్లు ముగిసేసరికి 83 ఈలో పాయింట్లతో నిలిచాడు. ఈ క్రమంలోనే తొలి ఐఎం నార్మ్ అందుకున్నాడు. అతనితోపాటు రాష్ట్రానికే చెందిన మరో చెస్ ప్లేయర్ అమిత్పాల్ సింగ్ కూడా ఇదో టోర్నీలో ఐఎం నార్మ్ సాధించాడు.