న్యూఢిల్లీ: అంతర్జాతీయ స్థాయిలో నిలకడగా రాణిస్తున్న తెలంగాణ బాక్సర్ మహమ్మద్ హుసాముద్దీన్.. ఆసియా ఎలైట్ బాక్సింగ్ చాంపియన్షిప్లో పతకం ఖాయం చేసుకున్నాడు. జోర్డాన్ వేదికగా జరుగుతోన్న మెగాటోర్నీ పురుషుల 57 కేజీల క్వార్టర్ ఫైనల్లో హుసాముద్దీన్ 5-0తో హెంగ్ సియోక్ లీ (దక్షిణ కొరియా)పై విజయం సాధించి సెమీఫైనల్కు దూసుకెళ్లాడు. ఫలితంగా కనీసం కాంస్య పతకం ఖరారు చేసుకున్నాడు. కామన్వెల్త్ క్రీడల్లో కాంస్యంతో సత్తాచాటిన హుసామ్.. తాజా పోరులో ఆరంభం నుంచే తన పంచ్లతో ప్రత్యర్థిని ఉక్కిరి బిక్కిరి చేశాడు. గురువారం జరుగనున్న సెమీఫైనల్లో సెరిక్ టెమిర్జాతో హుసాముద్దీన్ తలపడనున్నాడు. మహిళల విభాగంలో లవ్లీనా బొర్గోహై (75 కేజీలు), అనికుషిత (56 కేజీలు) కూడా సెమీఫైనల్కు చేరారు.