టీమిండియాకు మళ్లీ కష్టాలు మొదలయ్యాయి. 10 ఓవర్లకు కూడా పెద్దగా స్కోర్ చేయలేకపోయింది. ఇప్పటికే మూడు కీలక వికెట్లను భారత్ పోగొట్టుకుంది. 10 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి భారత్ 48 పరుగులు మాత్రమే చేసింది. ప్రస్తుతం క్రీజులో విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ ఉన్నారు.
అయితే.. మొదటి నుంచి న్యూజిలాండ్ బౌలర్లు.. టఫ్ బౌలింగ్ వేస్తుండటంతో.. టీమిండియా ప్లేయర్లు ఎక్కువ పరుగులు చేయలేకపోతున్నారు. ఇప్పటి వరకు ఒక్క రోహిత్ శర్మ మాత్రమే ఒక సిక్స్, ఒక ఫోర్ కొట్టగా.. ఇషాన్ కిషన్.. ఒక ఫోర్ బాదాడు. విరాట్ కోహ్లీ 16 బంతుల్లో 9 పరుగులు చేయగా.. రిషబ్ పంత్ 6 బంతుల్లో 3 పరుగులు చేశాడు.
న్యూజిలాండ్ బౌలర్లలో బౌల్ట్ రెండు ఓవర్లు వేసి ఒక వికెట్ తీసుకొని.. కేవలం 7 పరుగులు మాత్రమే ఇచ్చాడు. టిమ్ సౌథీ కూడా రెండు ఓవర్లు వేసి.. ఒక వికెట్ తీసి కేవలం 11 పరుగులు మాత్రమే ఇచ్చాడు. సోదీ.. ఒక ఓవర్ వేసి.. ఒక వికెట్ తీసి కేవలం 4 పరుగులు మాత్రమే ఇచ్చాడు.