BCCI : భారత జట్టు కొత్త సెలక్షన్ కమిటీని బీసీసీఐ శనివారం ప్రకటించింది. ఊహించినట్టుగానే ఐదుగురు సభ్యులతో కూడిన ఈ కమిటీకి హెడ్గా ప్రస్తుతం ఛైర్మన్గా ఉన్న చేతన్ శర్మను నియమించింది. శివ్ సుందర్ దాస్, సుబ్రతో బెనర్జీ, సలిల్ అంకోలా, శ్రీధరన్ శరత్లను సెలక్షన్ కమిటీ సభ్యులుగా బీసీసీఐ ఎంపిక చేసింది. ‘ఆలిండియా సీనియర్ మెన్స్ సెలక్షన్ కమిటీని ఎంపిక చేశాం. చేతన్ శర్మ మళ్లీ ఛైర్మన్గా ఎన్నికయ్యా డు’ అని బీసీసీఐ ట్విట్టర్లో పోస్టు పెట్టింది. ముగ్గురు సభ్యుల క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ) 11మందిని ఇంటర్వ్యూ చేసింది. అనంతరం ఐదుగురి పేర్లను బీసీసీఐకి ప్రతిపాదించింది. ఐదు పోస్టుల కోసం మొత్తం 600 మంది దరఖాస్తు చేసుకున్నట్టు బీసీసీఐ వెల్లడించింది. ఈ ఏడాది స్వదేశంలో అక్టోబర్ – నవంబర్లో జరగనున్న వన్డే వరల్డ్ కప్ను బీసీసీఐ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. వరల్డ్ కప్ సన్నాహకాల్లో భాగంగా 20 మంది ఆటగాళ్లను షార్ట్ లిస్ట్ కూడా చేసింది. అయితే.. వాళ్ల పేర్లు మాత్రం వెల్లడించలేదు.
టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్లో భారత జట్టు దారుణ ఓటమి తర్వాత సెలక్షన్ కమిటీపై విమర్శలు వెల్లువెత్తాయి. దాంతో, చేతన్ శర్మ కమిటీపై బీసీసీఐ వేటు వేసింది. అంతేకాదు కొత్త సెలక్షన్ కమిటీ ఎంపిక కోసం నవంబర్ 18న నోటిఫికేషన్ ఇచ్చింది. సెలక్షన్ కమిటీకి సభ్యులను ఎంపిక చేయడం కోసం ముగ్గురు సభ్యులతో క్రికెట్ సలహా కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో మాజీ మహిళా క్రికెటర్ సులక్షణ నాయక్, అశోక్ మల్హోత్రా, జతిన్ పరంజపే సభ్యులు. అయితే.. శ్రీలంక పర్యటనకు ముందు కొత్త కమిటీ నియామకం కాలేదు. దాంతో చేతన్ శర్మ నాయకత్వంలోని కమిటీనే టీ20, వన్డే జట్టును ప్రకటించింది.
NEWS 🚨- BCCI announces All-India Senior Men Selection Committee appointments.
Mr Chetan Sharma recommended for the role of Chairman of the senior men’s selection committee.
More details 👇👇https://t.co/K5EUPk454Y
— BCCI (@BCCI) January 7, 2023