దుబాయ్: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో టీమ్ఇండియా క్రికెటర్లు మహమ్మద్ సిరాజ్, శుభ్మన్గిల్ దుమ్మురేపారు. అద్భుత ఫామ్తో అదరగొడుతున్న వీరిద్దరు తాజా ఐసీసీ ర్యాంకింగ్స్లో నంబర్వన్ ర్యాంక్ దక్కించుకున్నారు. బుధవారం విడుదలైన ర్యాంకింగ్స్లో గిల్ 830 పాయింట్లతో తొలిసారి అగ్రస్థానం కైవసం చేసుకుంటే హైదరాబాదీ స్పీడ్స్టర్ సిరాజ్(709) మళ్లీ నంబర్వన్లోకి వచ్చాడు.
సచిన్, ధోనీ, కోహ్లీ తర్వాత బ్యాటింగ్లో టాప్ ర్యాంక్ సొంతం చేసుకున్న నాలుగో భారత బ్యాటర్గా గిల్ రికార్డు సొంతం చేసుకున్నాడు. ప్రపంచకప్లో నిలకడగా రాణిస్తున్న గిల్..పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్(824)ను వెనుకకు నెడుతూ అగ్రస్థానాన్ని అధిష్టించాడు. భారత్ నుంచి కోహ్లీ (770), రోహిత్శర్మ(739) వరుసగా నాలుగు, ఆరు ర్యాంక్ల్లో ఉన్నారు. బౌలింగ్ విభాగంలో కుల్దీప్యాదవ్ (661) నాలుగులో, బుమ్రా ఎనిమిదిలో (654), షమీ (635) పదో ర్యాంక్లో కొనసాగుతున్నారు.