న్యూఢిల్లీ: టీమ్ఇండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ మోకాలికి శస్త్రచికిత్స జరిగింది. ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పంత్కు శనివారం ముంబైలోని ఓ దవాఖానాలో సర్జరీ జరిగినట్లు బీసీసీఐ అధికారి వెల్లడించారు. ‘పంత్ మోకాలికి శుక్రవారం శస్త్రచికిత్స జరిగింది. ప్రస్తుతం అతడు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడు.
డాక్టర్ దిన్షా పర్దీవాలా బృందం పంత్కు వైద్యం అందిస్తున్నది’ అని ఆయన పేర్కొన్నారు. గతేడాది డిసెంబర్ 30న జరిగిన కారు ప్రమాదంలో పంత్కు తీవ్ర గాయాలు కాగా.. డెహ్రాడూన్ నుంచి మెరుగైన వైద్య చికిత్స కోసం అతడిని ఎయిర్ అంబులెన్స్ ద్వారా ముంబైకి తరలించిన విషయం తెలిసిందే.