భారత టెస్ట్ జట్టు ఆటగాడు ఛతేశ్వర్ పూజారా ఐదేళ్ల తర్వాత అర్జున అవార్డు అందుకున్నాడు. కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాగూర్ చేతుల మీదుగా పూజారా శనివారం ఈ అవార్డు అందుకున్నాడు. 2017 లో పూజారాకు కేంద్ర ప్రభుత్వం అర్జున అవార్డును ప్రకటించింది. అయితే, ఆ ఏడాది అతను అవార్డు వేడుకకు హాజరు కాలేదు. ఐదేళ్ల తర్వాత అర్జున అవార్డు అందుకున్న పూజారా ఫొటోను ట్విట్టర్లో పోస్ట్ చేశాడు.
‘ఆలస్యం అయినా కూడా నాకు సన్మానం చేసి, అర్జున అవార్డు ప్రదానం చేసినందుకు బీసీసీఐ, అనురాగ్ ఠాకూర్కి ధన్యవాదాలు. తీరిక లేని క్రికెట్ షెడ్యూల్ కారణంగా ఆ ఏడాది అవార్డు అందుకోలేకపోయాను. అవార్డు వచ్చినందుకు చాలా ఆనందంగా, గర్వంగా ఉంది’ అంటూ పూజారా ట్వీట్ చేశాడు.
రాహుల్ ద్రావిడ్ తర్వాత భారత టెస్ట్ జట్టుకు మరో వాల్గా పూజారా పేరు తెచ్చుకున్నాడు. ఈమధ్యే కౌంటీ క్రికెట్లో అదరగొట్టిన పూజారా డిసెంబర్లో బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్తున్న భారత టెస్ట్ జట్టుకు పూజారా ఎంపికయ్యాడు. టీమిండియా, బంగ్లాదేశ్తో రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడనుంది. ఈ స్టార్ బ్యాటర్ ఇప్పటి వరకూ 96 టెస్ట్లు ఆడాడు.
Thankful to @IndiaSports, @BCCI and @ianuragthakur to organise and handover the Arjuna Award belatedly, which I could not collect the year it was awarded to me due to my cricket commitments. Honoured and grateful🙏 pic.twitter.com/Dokz4ZP3Hs
— Cheteshwar Pujara (@cheteshwar1) November 19, 2022