Virat Kohli | ముంబై: టీమ్ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్కోహ్లీ, అనుష్కశర్మ దంపతులకు త్వరలో రెండో సంతానం కలుగబోతున్నది. ఈ విషయాన్ని విరాట్ ఆప్తమిత్రుడు దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ డివిలీయర్స్ శనివారం వెల్లడించాడు. కోహ్లీ కుటుంబంలోకి కొత్తగా మరొకరు రాబోతున్నారంటూ పేర్కొన్నాడు.
వ్యక్తిగత కారణాలతో ఇంగ్లండ్తో తొలి రెండు టెస్టులకు కోహ్లీ దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో డివిలీయర్స్ మాట్లాడుతూ ‘నాకు తెలిసినంత వరకు కోహ్లీ ప్రస్తుతం బాగానే ఉన్నాడు. అతడు కుటుంబంతో గడుపుతున్న కారణంగా ఇంగ్లండ్తో టెస్టు సిరీస్కు దూరమయ్యాడు. రెండో సంతానం కోసం అతను ఎదురుచూస్తున్నాడు. కుటుంబంతో గడిపేందుకు కోహ్లీకి ఇది విలువైన సమయం’ అని అన్నాడు.