బెంగళూరు : ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను 4-1తో గెలుచుకున్న అనంతరం టీమ్ ఇండియా మరో కఠిన పరీక్షకు సిద్ధమైంది. దక్షిణాఫ్రికాతో మూడు ఫార్మాట్లలో తలపడేందుకు బుధవారం బయలుదేరి వెళ్లింది. ఈ పర్యటనలో మూడు టి20లు, మూడు వన్డేలు, రెండు టెస్టులలో ఇరు జట్లు తలపడనున్నాయి. ఆదివారం డర్బన్లోని కింగ్స్మీడ్లో తొలి టి20తో పర్యటన ప్రారంభం కానున్నది. రెండో టి20 12న గెబరాలో, మూడో టి2014న జొహాన్నెస్బర్గ్లో జరుగనున్నాయి. అనంతరం జొహాన్నెస్బర్గ్లోనే 17న వన్డే సిరీస్ ఆరంభమౌతుంది. 19న గెబెరాలో రెండో వన్డే, 21న పార్ల్లో మూడో వన్డే జరుగుతాయి.
ఇక చివరగా బాక్సింగ్ డే (డిసెంబర్ 26)న సెంచురియన్లో టెస్టు సిరీస్కు శ్రీకారం దిద్దనున్నారు. జనవరి 3నుంచి కేప్టౌన్లో రెండో టెస్టుతో పర్యటన ముగుస్తుంది. వచ్చే యేడాది టి20 ప్రపంచకప్ జరుగనున్నందున యువ ఆటగాళ్లపై బోర్డు దృష్టి సారించనున్నది. పర్యటన కూడా టి20 సిరీస్తో ప్రారంభం కానున్నది. యువ ఆటగాళ్లతో కూడిన టి20 జట్టుకు సూర్యకుమార్ సారథ్యం వహించనున్నాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ బోర్డుకు తెలపడంతో జడేజా వైస్కెప్టెన్గా వ్యవహరించనున్నాడు.