Robin Uthappa : పొట్టి క్రికెట్కు ఆదరణ పెరుగుతున్నందున రాబోయే రోజుల్లో వన్డే క్రికెట్ మసకబారే అవకాశం ఉందని భారత జట్టు మాజీ ఆటగాడు రాబిన్ ఊతప్ప అన్నాడు. ‘టీ20 లీగ్లు అభిమానులకు కావాల్సినంత వినోదాన్ని పంచుతున్నాయి. దాంతో ఎక్కువ మంది వీటిని చూసేందుకు ఇష్టపడుతున్నారు. అంతేకాదు మరికొన్ని టీ10 లీగ్లు ఉన్నాయి. ఇవి చైనా, జర్మనీ వంటి దేశాలు క్రికెట్లో అడుగుపెట్టేందుకు దోహదపడనున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు వన్డే మ్యాచ్ చూసేందుకు ఆరేడు గంటలు కేటాయిస్తారని నేను అనుకోవడం లేదు’ అని అతను అభిప్రాయపడ్డాడు.
భారత్ తరఫున టీ20లు, వన్డేల్లో ఊతప్ప ఓపెనర్గా బరిలోకి దిగాడు. మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యలో తొలి టీ20 వరల్డ్ కప్ గెలిచిన జట్టులో ఇతను సభ్యుడు. హిట్టర్గా పేరొందిన ఇతను 2022 సెప్టెంబర్ 14న అంతర్జాతీయ క్రికెట్కు గుడ్ బై చెప్పాడు. ప్రస్తుతం అంతర్జాతీయ టీ20 లీగ్లో దుబాయ్ క్యాపిటల్స్కు ఆడుతున్నాడు. రిటైర్మెంట్ తర్వాత ఐపీఎల్లో అతను అదరగొట్టాడు. ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పూణే వారియర్స్ ఇండియా, కోల్కతా నైట్ రౌడర్స్, చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంఛైజీలకు ఆడాడు.