న్యూఢిల్లీ: వచ్చే నెల ఒకటి నుంచి ఇంగ్లండ్తో జరుగనున్న ఏకైక టెస్టు కోసం టీమ్ఇండియా కసరత్తులు ప్రారంభించింది. ఇప్పటికే ఆటగాళ్లు లండన్కు చేరుకోగా.. సోమవారం కెప్టెన్ రోహిత్ శర్మ, ఓపెనర్ శుభ్మన్ గిల్ నెట్ ప్రాక్టీస్ చేశారు. లైసెస్టెర్షైర్ కౌంటీ గ్రౌండ్లో వీరిద్దరూ సాధన చేశారు.
టెస్టు మ్యాచ్కు ముందు ఈ నెల 24 నుంచి స్థానిక కౌంటీ జట్టుతో టీమ్ఇండియా 4 రోజుల వామప్ మ్యాచ్ ఆడనుంది. ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఇరు జట్ల మధ్య గతేడాది నాలుగు టెస్టులు జరుగగా.. కరోనా కారణంగా ఆఖరి పోరు అర్ధాంతరంగా వాయిదా పడింది. సగంలో నిలిచిపోయిన సిరీస్లో ప్రస్తుతం టీమ్ఇండియా 2-1తో ముందంజలో ఉంది.