హైదరాబాద్, ఆట ప్రతినిధి : టీ9 చాలెంజ్ నాలుగో సీజన్ గోల్ఫ్ టోర్నమెంట్ హోరాహోరీగా సాగుతున్నది. మూడో రోజు ఆటలో 4 పాయింట్లకు గాను 3.5 పాయింట్లు సాధించింది. దాంతో మొత్తం 9 పాయింట్లతో పూల్-ఏ టేబుల్ టాప్లో స్పష్టమైన ఆధిక్యాన్ని సంపాదించింది. ఇప్పటివరకు ఆడిన 12 మ్యాచ్ల్లో ఈ జట్టు కేవలం ఒక్క మ్యాచ్లోనే ఓడిపోవడం విశేషం.
ఇదే పూల్లో బంకర్ బస్టర్స్ (7) రెండో స్థానంలో, వీసాఫ్ట్ టైటాన్స్ (6) మూడో స్థానంలో ఉన్నాయి. పూల్-బి ఆర్డీ ఐరన్ ఈగల్స్ (8) అగ్రస్థానంలో కొనసాగుతుండగా, మూడో రోజు 3 పాయింట్లు ఖాతాలో వేసుకున్న ఫేర్వే వారియర్స్.. జాగృతి జాగ్వార్స్ జట్టుతో కలిసి చెరో 6 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాయి.