జ్యోతినగర్ (రామగుండం), సెప్టెంబర్26: చిన్నతనం నుంచే క్రికెట్లో రాణిస్తున్న గురుకుల విద్యార్థి మహమ్మద్ తౌఫీక్ జాతీయ స్థాయి అండర్-14 పోటీలకు ఎంపికయ్యాడు. పెద్దపల్లి జిల్లా రామగుండం గురుకుల పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న తౌఫీక్.. ఈ నెల 15, 16 తేదీల్లో హైదరాబాద్లో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయికి ఎంపియ్యాడు. తమ పాఠశాల విద్యార్థి జాతీయ పోటీల్లో పాల్గొనడంపై ప్రిన్సిపాల్ శ్రీధర్, పీఈటీ రాజు హర్షం వ్యక్తంచేశారు. ప్రస్తుతం హర్యానాలో జరుగుతున్న పోటీల్లో పాల్గొంటున్న తౌఫీక్.. భవిష్యత్తులో మరింత ఎత్తుకు ఎదగాలని ఆకాంక్షించారు.