ఇబ్రహీంపట్నంరూరల్, మార్చి 25: ప్రకృతిలో సహజ సిద్ధంగా లభించే కొబ్బరి బొండం పోషకాల గని అని . వేసవిలో కొబ్బరి బొండాన్ని అమృత భాం డంగా చెప్పుకోవచ్చు. కల్తీలేని కొబ్బరినీటిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కొబ్బరినీళ్లు తాగి తే వేసవి తాపం నుంచి తక్షణం ఉపశమనం, అలసట నుంచి శక్తిని పొందవచ్చు. కొబ్బరి నీళ్లతో పోషక పదార్థాలతోపాటు రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. రక్తాన్ని శుద్ధి చేసే గుణం ఈ నీళ్లలో ఉంటుంది. శరీరంలో లవణాల శాతాన్ని పెంచడానికి కూడాఎంతో ఉపయోగపడుతాయి. గ్లూకోజ్లో ఉండే పోషకాలకంటే అధికంగా కొబ్బరి నీళ్లలో లభిస్తాయని వైద్యు లు చెబుతున్నారు.
వేసవిలో కొబ్బరిబొండాలకు డిమాండ్
వేసవి కాలం ప్రారంభమవడంతో కొబ్బరి బొండాలకు డిమాండ్ పెరిగింది. స్థానికంగా ఉన్న తోటలతో పాటు బెంగళూరు, ఆంధ్రా ప్రాంతం నుంచి భారీగా దిగుమతి చేసుకుని మార్కెట్లలో విక్రయిస్తున్నారు. బొండం ధర కాయ సైజును బట్టి రూ.40, రూ.60 వర కు విక్రయిస్తున్నారు. ఇబ్రహీంపట్నంలోని సాగర్ హైవేపై, బస్టాండు సమీపంలో, మంచాల రోడ్డు, తహసీల్దార్ కార్యాలయం రోడ్డులో దుకాణాలు ఏర్పాటు చేసి పెద్దఎత్తున కొబ్బరి బొండాలు విక్రయిస్తున్నారు.
పోషకాలు పుష్కలం..
కొబ్బరిబొండంలో సోడియం, పొటాషియం, కాల్షి యం, ఫాస్పరస్, ఐరన్, సల్ఫర్, క్లోరైడ్, ప్రోటీన్స్, ఇతర ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. పాలలోని ప్రొటీన్ల కంటే అధిక శాతం కొబ్బరి నీళ్లలో ఉంటా యి. శరీరంలో లవణాల శాతం పడిపోయినప్పుడు కొబ్బరి నీళ్లు తాగినప్పుడు పెరిగే అవకాశం ఉంటుందని డాక్టర్లు సూచిస్తున్నారు. మూత్రపిండాల సమస్య ఉంటే కొంత మేరకు తగ్గించి శరీరానికి చల్లదనం ఇస్తుంది. మార్కెట్లో దొరికే వివిధ రసాయనలతో తయారు చేసిన చల్లని పానీయాల కంటే వంద రెట్లు ఆరోగ్యం పంచే కొబ్బరిబొండం మేలని డాక్టర్లు చెబుతున్నారు.