ఆస్తానా: పురుషుల ఔటసైడ్ షాట్పుట్లో జాతీయ రికార్డు నెలకొల్పిన తాజిందర్పాల్ సింగ్ తూర్.. ఏషియన్ ఇండోర్ అథ్లెటిక్ చాంపియన్షిప్స్-2023లో శుక్రవారం స్వర్ణం గెలుచుకున్నాడు. కజకిస్థాన్లోని ఆస్తానాలో జరుగుతున్న ఈ పోటీల్లో 19.49 మీటర్ల దూరం గుండును విసిరి ఇండోర్ గేమ్స్లో తన వ్యక్తిగత అత్యుత్తమ గణాంకాలను నమోదు చేశాడు.
ఒలింపిక్స్.కామ్లోని వివరాల ప్రకారం.. తాజిందర్ సింగ్ 2018 ఏషియన్ గేమ్స్లో బంగారు పతకం గెలిచాడు. 2019 అవుట్ డోర్ ఏషియన్ గేమ్స్లో చాంపియన్గా నిలిచాడు. 2018లో టెహ్రాన్లో జరిగిన గత చాంపియన్ షిప్స్లో తాజిందర్ గుండును 19.18 మీటర్ల దూరం విసిరి సిల్వర్ మెడల్ సాధించాడు. తాజా గేమ్స్లో మొదటి అటెంప్ట్లోనే తూర్ విఫలమయ్యాడు. తర్వాత మూడో, ఐదో అటెంప్ట్లలో గుండును 19.49 మీటర్ల దూరం విసిరి గోల్డ్ మెడల్ గెలుచుకున్నాడు.
తాజిందర్ సింగ్ తూర్ కాకుండా మరో అథ్లెట్ మాత్రమే షాట్పుట్ గుండును 19 మీటర్ల కంటే ఎక్కువ దూరం విసరగలిగాడు. 19.37 మీటర్ల దూరంతో కరన్వీర్ సింగ్ రెండో స్థానంలో నిలిచి సిల్వర్ మెడల్ సాధించాడు. కజికిస్థాన్కు చెందిన ఐవాన్ ఐవనోవ్ 18.10 మీటర్ల దూరం విసిరి కాంస్య పతకం దక్కించుకున్నాడు.