India Open 2024: న్యూఢిల్లీ వేదికగా జరుగుతున్న ఇండియా ఓపెన్ సూపర్ 750 టోర్నమెంట్ మహిళల టైటిల్ను మాజీ వరల్డ్ ఛాంపియన్, చైనీస్ తైఫీకి చెందిన తై జూ యింగ్ దక్కించుకుంది. ఆదివారం ఢిల్లీ లోని కేడీ జాదవ్ ఇండోర్ స్టేడియం వేదికగా ముగిసిన మహిళల సింగిల్స్ ఫైనల్స్లో తై జూ.. 21-16, 21-12 తేడాతో చైనా క్రీడాకారిణి చెన్ యూ ఫీని ఓడించింది. వరుస సెట్లలో గెలిచిన తై జూ… ఇండియా ఓపెన్ టైటిల్ను దక్కించుకుంది.
మిక్స్డ్ డబుల్స్లో థాయ్లాండ్ ద్వయం డెచాపుల్ పువరనుక్రో – సప్సైర్లు.. 21-16, 21-16 తేడాతో చైనాకు చెందిన వరల్డ్ నెంబర్ 5 ర్యాంకర్ జోడీ జియాంగ్ జెన్ – వి యా జిన్లను ఓడించింది. నేటి సాయంత్రం పురుషుల సింగిల్స్లో చైనా ప్లేయర్ షి యుకీ – లీ చెక్ యూ (హాంకాంగ్) మధ్య పోరు జరగాల్సి ఉంది. పురుషుల డబుల్స్లో భారత స్టార్ ద్వయం సాత్విక్ – చిరాగ్ల ద్వయం.. వరల్డ్ ఛాంపియన్స్ జోడీ కంగ్ మిన్ హ్యూక్ – సియో సియుంగ్ జే (సౌత్ కొరియా)లను ఢీకొనబోతున్నారు.
#IndiaOpen2024 – Women’s Singles
🥇Tai Tzu Ying (TPE)
🥈Chen Yufei (CHN)Congratulations to both players! pic.twitter.com/xZN5wdh9wh
— Badminton Talk (@BadmintonTalk) January 21, 2024