హైదరాబాద్, ఆట ప్రతినిధి: క్రికెట్లోని టీ20 ఫార్మాట్ స్ఫూర్తితో రూపొందించిన ప్రతిష్టాత్మక టీ9 చాలెంజ్ గోల్ఫ్ టోర్నీ నాలుగో సీజన్ హైదరాబాద్ గచ్చిబౌలిలోని బౌల్డర్ హిల్స్ గోల్ఫ్ క్లబ్లో శనివారం మొదలైంది. టీగోల్ఫ్ ఫౌండేషన్ నిర్వహిస్తున్న ఈ 9-హోల్ లీగ్ పోటీలొ 12 జట్లు, 108 మంది గోల్ఫర్లు బరిలో నిలిచారు. నాలుగో సీజన్ ట్రోఫీని బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ సభ్యుడు చాముండేశ్వరనాథ్, టీగోల్ఫ్ ఫౌండేషన్ సీఈఓ ఎన్ఆర్ఎన్ రెడ్డితో కలిసి ఆవిష్కరించారు. అనంతరం జరిగిన తొలి రౌండ్ పూల్-ఏలో -3.5 స్కోరుతో పార్-టైమర్స్ అగ్రస్థానం అందుకోగా.. -3.0 స్కోరుతో బంకర్ బస్టర్స్, విసాఫ్ట్ టైటాన్స్ సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచాయి.