టీ 20 వరల్డ్ కప్ ఫైనల్లో ఇంగ్లాండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ జట్టు 20 ఓవర్లలో 137 పరుగులు చేసింది. ఓపెనర్ రిజ్వాన్ 15 పరుగులకే అవుట్ అయ్యాడు. కెప్టెన్ బాబర్ ఆజం (32 పరుగులు), మిడిల్ ఆర్డర్ బ్యాటర్ షాన్ మసూద్ ఇన్నింగ్స్ని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. దాంతో, 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి పాకిస్థాన్ 137 పరుగులు చేసింది కోల్పోయింది. షాన్ మసూద్ 38 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు.
ఇంగ్లాండ్ బౌలర్లలో సామ్ కర్రన్ మూడు వికెట్లు పడగొట్టాడు. ఆదిల్ రషీద్, క్రిస్ జోర్డాన్ చెరో రెండు వికెట్లు తీశారు. బెన్ స్టోక్స్కి ఒక వికెట్ దక్కింది.