న్యూఢిల్లీ: టీమ్ఇండియా స్పీడ్స్టర్ తంగరసు నటరాజన్కు మంగళవారం శస్త్రచికిత్స విజయవంతంగా జరిగింది. మోకాలి గాయంతో ఐపీఎల్ నుంచి అర్ధాంతరంగా వైదొలిగిన సన్రైజర్స్ హైదరాబాద్ పేసర్ నటరాజన్ ఈ సందర్భంగా ట్విట్టర్లో స్పందించాడు. ‘ఈ రోజు నాకు శస్త్రచికిత్స జరిగింది. బీసీసీఐకి, వైద్య సిబ్బంది, డాక్టర్లు, నర్సులకు కృతజ్ఞతలు’ అని నటరాజన్ ట్వీట్ చేశాడు. గతేడాది ఆస్ట్రేలియా పర్యటనలో ఈ తమిళనాడు యువ ఫాస్ట్బౌలర్..మోకాలి గాయం బారిన పడ్డాడు.