చెన్నె: భారత ఫాస్ట్ బౌలర్ నటరాజన్ తన స్వగ్రామంలో క్రికెట్ మైదానం నిర్మిస్తున్నాడు. తమిళనాడు సేలం సమీపంలోని చిన్నపంపట్టి గ్రామంలో సకల సౌకర్యాలతో మైదానం ఏర్పాటు చేస్తున్నట్లు నటరాజన్ ప్రకటించాడు. ‘అన్ని సౌకర్యాలతో మా గ్రామంలో క్రికెట్ గ్రౌండ్ సిద్ధమవుతున్నదని చెప్పడానికి ఎంతో సంతోషంగా ఉంది. నటరాజన్ క్రికెట్ గ్రౌండ్ (ఎన్సీజీ)తో నా కల నెరవేరింది. గత డిసెంబర్లో భారత క్రికెట్లో అరంగేట్రం చేశా. ఈ డిసెంబర్లో క్రికెట్ మైదానం ఏర్పాటు చేస్తున్నా’ అని నటరాజన్ ట్వీట్ చేశాడు. గ్రామీణ ప్రాంతంలో యువతకు క్రికెట్ అవకాశాలను కల్పించేందుకు నటరాజన్ ఈ మైదానం నిర్మిస్తున్నాడు.