హైదరాబాద్, ఆట ప్రతినిధి: టీ గోల్ఫ్ ఫౌండేషన్ మరో ప్రతిష్టాత్మక టోర్నీకి శ్రీకారం చుట్టింది. బౌల్డర్హిల్స్ గోల్ఫ్ అండ్ కంట్రీ క్లబ్తో కలిసి అమెచ్యూర్ ప్లేయర్ల కోసం హైదరాబాద్ గోల్ఫ్ చాంపియన్షిప్ను ఈనెల 18 నుంచి 21 వరకు నిర్వహిస్తున్నది. ఇందుకు సంబంధించిన జెర్సీలను నిర్వాహకులు సోమవారం విడుదల చేశారు.
దేశవ్యాప్తంగా ఉన్న అమెచ్యూర్ గోల్ఫర్లకు ఇది గొప్ప వేదికగా నిలుస్తుందని టీ గోల్ఫ్ ఫౌండర్ ఎన్ఆర్ఎన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మధుసూదన్రావు, రూబిన్ చెరియన్, నారాయణం, శ్రీకాంత్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.