అమరావతి : టీ 20 సిరీస్(T-20 Series )లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా క్రికెట్ జట్లు మంగళవారం విశాఖపట్నంకు చేరుకున్నాయి. గురువారం( ఈ నెల 23) నుంచి రెండు జట్లు అయిదు టీ 20ల్లో తలపడనున్నాయి. కాగా విశాఖ పట్నంకు చేరుకున్న భారత టీం ఆటగాళ్లు పీఎం పాలెం స్టేడియంలో నెట్ ప్రాక్టీస్ చేశారు.
వన్డే ప్రపంచకప్లో ఆస్ట్రేలియాతో ఆడిన పైనల్ మ్చాచ్లో భారత్ ఓడిన తరువాత నాలుగురోజుల్లో టీ20 సిరీస్ ప్రారంభం అవుతుండడం పట్ల క్రికెట్ ప్రేమికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 26న తిరువనంతపురం, 28న గుహవటి, డిసెంబర్ 1న రాయపూర్, 3న బెంగళూరులో పోటీ జరుగనుంది. ఈ సిరీస్కు సూర్యకుమార్ యాదవ్ (Capatain Suryakumar)భారత్ జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు.
ఏడాదిగా టీ20 మ్యాచ్లకు సారథ్య బాధ్యతలు వహిస్తున్న హర్తిక్ పాండ్యా ప్రపంచకప్ మ్యాచ్లో గాయపడడంతో ఆటకు దూర మయ్యాడు. ఈ సిరీస్లో కూడా దూరం కావడంతో వైస్ కెప్టెన్గా ఉన్న సూర్యకుమార్ యాదవ్కు కెప్టెన్ బాధ్యతలు అప్పగించారు. అదేవిధంగా ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ మూడు మ్యాచ్లకు వైస్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు.
భారత్ జట్టు కెప్టెన్ రోహిత్శర్మ, విరాట్ కోహ్లి ఈ సిరీస్లో ఆడడం లేదు. ప్రపంచకప్లో తన ప్రతిభను చాటిన మరో ఆటగాడు శ్రేయస్ అయ్యర్ మూడు మ్యాచ్లు ఆడడం లేదు. 4, 5వ మ్యాచ్లో ఆడనున్నాడు. టీ 20 భారత్ టీంలో ఇంకా ఇషాన్ కిషన్, యశస్వి జైస్వాల్, తిలక్వర్మ, రింకు సింగ్, జితేశ్ శర్మ, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, శివమ్ దూబే, రవి బిష్ణోయ్, అర్ష్దీప్ సింగ్ , ప్రసిద్ద్ కృష్ణ, అవేశ్ ఖాన్, ముకేశ్ కుమార్ ఆడనున్నారు.