భారత టేబుల్ టెన్నిస్ (టీటీ)లో బెంగాల్ ప్యాడ్లర్లు సుతీర్థ ముఖర్జీ-ఐహిక ముఖర్జీ చరిత్ర సృష్టించారు. సోమవారం మహిళల డబుల్స్ సెమీఫైనల్లో సుతీర్థ-ఐహిక జోడీ 3-4 (11-7, 8-11, 11-7, 8-11, 9-11, 11-5, 2-11)తో చా సుయెంగ్-పాక్ సుగ్యాంగ్ (ఉత్తర కొరియా) ద్వయం చేతిలో పోరాడి ఓడింది. హోరాహోరీగా సాగిన ఏడు గేమ్ల పోరులో మనవాళ్లు సత్తాచాటినా.. కీలక సమయాల్లో పాయింట్లు కొల్లగొట్టిన కొరియన్లు ఫైనల్కు చేరారు. క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ చాంపియన్ చైనా జోడీని మట్టకరిపించిన భారత జంట.. సెమీస్లో అలాంటి ప్రదర్శనే చేసే ప్రయత్నం చేసినా ఫలితం మాత్రం భిన్నంగా వచ్చింది. కాగా.. టేబుల్ టెన్నిస్ మహిళల డబుల్స్లో భారత్కు ఇదే తొలి పతకం కావడం విశేషం.