న్యూఢిల్లీ: ఛత్రాసాల్ స్టేడియం ఘర్షణ కేసులో తీహార్ జైలులో ఉన్న స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్ టెలివిజన్ కావాలని అధికారులను అడిగాడు. రెజ్లింగ్ మ్యాచ్లకు సంబంధించి సమాచారం తెలుసుకునేందుకు టీవీ ఏర్పాటు చేయాలని కోరాడు. ఈ విషయాన్ని తీహార్ జైలుకు చెందిన ఓ సీనియర్ అధికారి వెల్లడించారు. తన న్యాయవాది ద్వారా సుశీల్ తమకు విజ్ఞప్తి చేశాడని చెప్పారు. ఈ ఏడాది మే 4న ఛత్రాసాల్ స్టేడియంలో జరిగిన గొడవలో సాగర్ ధన్కర్ అనే యువ రెజ్లర్ మరణానికి కారణయ్యాడనే అభియోగాలతో ఒలింపిక్ మెడలిస్ట్ సుశీల్ కుమార్ ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నాడు.