టీ20 క్రికెట్లో గత ఏడాది కాలంగా నిలకడగా రాణిస్తున్న టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ మళ్లీ ఐసీసీ టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో నెంబర్ వన్ ర్యాంకుకు దూసుకొస్తున్నాడు. మంగళవారం మొహాలీలో ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20లో 25 బంతుల్లోనే 46 పరుగులు చేయడంతో అతడి ర్యాంకు కూడా మెరుగుపడింది. ఐసీసీ తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్లో సూర్య 780 రేటింగ్ పాయింట్లతో మూడో స్థానానికి చేరాడు.
ఈ జాబితాలో పాకిస్తాన్ ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్.. 825 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. రెండో స్థానంలో దక్షిణాఫ్రికా బ్యాటర్ ఎయిడెన్ మార్క్రమ్ (792 పాయింట్లు) ఉండగా గత వారం మూడో స్థానంలో ఉన్న పాక్ సారథి బాబర్ ఆజమ్ను సూర్య వెనక్కి నెట్టాడు. ఆసీస్ తో మ్యాచ్ ద్వారా సూర్య రెచ్చిపోవడం అతడికి కలిసొస్తే ఆసియా కప్లో పేలవ ఫామ్తో పాటు ఇంగ్లండ్తో తొలి టీ20లో కూడా బాబర్ విఫలమవ్వడంతో బాబర్ ర్యాంకు పడిపోయింది. అతడు ప్రస్తుతం 771 పాయింట్లతో నాలుగో స్థానానికి పడిపోయాడు.
టాప్-10 జాబితాలో సూర్య తప్ప మరే భారత బ్యాటర్ చోటు దక్కించుకోలేదు. ఆసీస్తో మొహాలీ మ్యాచ్లో హాఫ్ సెంచరీతో కదం తొక్కిన కెఎల్ రాహుల్.. ఐదు స్థానాలు ఎగబాకి 18వ ర్యాంకుకు చేరగా.. ఇదే మ్యాచ్లో 71 పరుగులతో నాటౌట్గా నిలిచిన హార్ధిక్ పాండ్యా 23 స్థానాలు మెరుగుపరుచుకుని 65వ ర్యాంకులో ఉన్నాడు. రోహిత్ శర్మ 14, విరాట్ కోహ్లీ ఒక స్థానం దిగజారి 16 స్థానానికి పరిమితమయ్యాడు.
Star Indian batter closes in on the top spot in the @MRFWorldwide ICC Men’s Player T20I Rankings for batters ⬆️
Details 👇https://t.co/pdcD6jfjkN
— ICC (@ICC) September 21, 2022