దుబాయ్: ఐసీసీ టి20 ‘క్రికెటర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డుకు పురుషుల విభాగంలో సూర్యకుమార్ యాదవ్, మహిళల విభాగంలో స్మృతి మందన పేర్లను ప్రతిపాదించారు. సూర్యకుమార్ ఇంగ్లండ్ ఆల్రౌండర్ సామ్ కరన్, పాకిస్థాన్ వికెట్ కీపర్ మహమ్మద్ రిజ్వాన్, జింబాబ్వే ఆల్రౌండర్ సికిందర్ రజాలతో పోటీపడుతుండగా, మందన పాకిస్థాన్ ఆల్రౌండర్ నిదా డార్, న్యూజిలాండ్కు చెందిన సోఫీ డివైన్, ఆస్ట్రేలియాకు చెందిన తహిల మెక్గ్రాత్లతో పోటీపడుతున్నది.