న్యూఢిల్లీ: కరోనా వైరస్ పోరాటంలో సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ భారీ విరాళంతో ముందుకొచ్చింది. ప్రమాదకర వైరస్తో దేశ వ్యాప్తంగా నెలకొన్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని సన్రైజర్స్ రూ.30 కోట్ల సహాయం చేస్తున్నట్లు సోమవారం ప్రకటించింది. సహాయక చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వంతో పాటు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, ఎన్జీవోలకు ఈ విరాళమిస్తున్నట్లు పేర్కొంది. ‘కొవిడ్-19తో ప్రభావితమైన వారిని ఆదుకునేందుకు రూ.30 కోట్ల సహాయం చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం, వివిధ రాష్ర్టాలు అమలు చేస్తున్న పలు కార్యక్రమాలకు ఈ నిధులు ఉపయోగపడుతాయి. పలు ఎన్జీవోలతో కలిసి కరోనా పేషెంట్లకు కావాల్సిన ఆక్సిజన్ సిలిండర్లు, మందుల కోసం ఈ మొత్తాన్ని వెచ్చిస్తాం’ అని సన్రైజర్స్ తమ అధికారిక ట్విట్టర్లో తెలిపింది. తమకే చెందిన సన్ నెట్వర్క్ ద్వారా దేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా అందరికీ కరోనా వైరస్పై అవగాహన కల్పిస్తామని పేర్కొంది.