సన్రైజర్స్ హైదరాబాద్(ఎస్ఆర్హెచ్) సొంతగడ్డపై దుమ్మురేపింది. ఉప్పల్ స్టేడియంలో డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్కింగ్స్(సీఎస్కే)ను చిత్తుచేస్తూ అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. తొలుత తమ సూపర్ బౌలింగ్తో చెన్నైని స్వల్ప స్కోరుకు కట్టడి చేసిన రైజర్స్.. బ్యాటింగ్లోనూ అదరగొట్టింది. ఓపెనర్ అభిషేక్శర్మ సుడిగాలి ఇన్నింగ్స్తో అదిరిపోయే ఆరంభాన్ని ఇస్తే..మార్క్మ్ సాధికారిక ఇన్నింగ్స్తో జట్టు విజయంలో కీలకమయ్యాడు. మొత్తంగా సొంత ఇలాకాలో సన్రైజర్స్ హైదరాబాద్ వరుసగా రెండో విజయాన్ని సొంతం చేసుకుంది. తమ అభిమాన క్రికెటర్ ధోనీని చూసేందుకు ఉప్పల్ స్టేడియానికి ప్రేక్షకులు భారీ సంఖ్యలో పోటెత్తారు.
SRH | హైదరాబాద్, ఆట ప్రతినిధి : ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్ ఆకట్టుకుంది. శుక్రవారం ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ 6 వికెట్ల తేడాతో చెన్నై సూపర్కింగ్స్పై ఘన విజయం సాధించింది. తొలుత శివమ్దూబే(24 బంతుల్లో 45, 2 ఫోర్లు, 4సిక్స్లు), రహానే(35) రాణించడంతో చెన్నై 20 ఓవర్లలో 165-5 స్కోరు చేసింది. భువనేశ్వర్, నటరాజన్, కమిన్స్, షాబాజ్, ఉనద్కత్ ఒక్కో వికెట్ తీశారు. ఆ తర్వాత లక్ష్యఛేదనలో హైదరాబాద్..18.1 ఓవర్లలో 166-4 స్కోరు చేసింది. మార్క్మ్(్ర36 బంతుల్లో 50, 4ఫోర్లు, సిక్స్), అభిషేక్శర్మ(12 బంతుల్లో 37, 3ఫోర్లు, 4సిక్స్లు) విజృంభించారు. అలీ(2-23) రెండు వికెట్లు తీయగా, చాహర్, తీక్షణ ఒక్కో వికెట్ పడగొట్టారు. అభిషేక్శర్మకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది.
చెన్నై నిర్దేశించిన లక్ష్యఛేదనను సన్రైజర్స్ హైదరాబాద్ ఆడుతూ పాడుతూ ఛేదించింది. పసలేని చెన్నై బౌలింగ్ను ఆది నుంచే ఆలవోకగా ఎదుర్కొంటూ లక్ష్యం వైపు సాగింది. చాహర్ తొలి ఓవర్ రెండో బంతికే ట్రావిస్ హెడ్..ఔట్ నుంచి తప్పించుకున్నాడు. స్లిప్లో మొయిన్ అలీ క్యాచ్ విడిచిపెట్టడంతో బతికిపోయాడు. రెండో ఓవర్కు వచ్చిన ముకేశ్ చౌదరీని అభిషేక్శర్మ చీల్చిచెండాడు. మూడు కండ్లు చెదిరే సిక్స్లతో తోడు రెండు ఫోర్లతో ఏకంగా 27 పరుగులు స్కోరుబోర్డుకు జతచేశాడు. చాహర్ బౌలింగ్లో సిక్స్, ఫోర్తో అదే దూకుడు కొనసాగించబోయిన అభిషేక్..జడేజా సూపర్క్యాచ్తో తొలి వికెట్గా వెనుదిరిగాడు. దీంతో మొదటి వికెట్కు 46 పరుగుల భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. శర్మ తర్వాత వచ్చిన మార్క్మ్.్ర.హెడ్కు జతకలిశాడు. తుషార్ ఆరో ఓవర్లో మూడు ఫోర్లతో హైదరాబాద్ వికెట్ కోల్పోయి 78 పరుగులు చేసింది. ఈ క్రమంలో రైజర్స్ రెండో అత్యుత్తమ(78-1) పవర్ప్లే స్కోరును తమ ఖాతాలో వేసుకుంది. హెడ్, మార్క్మ్ నింపాదిగా ఇన్నింగ్స్ను ముందుకు నడిపించారు. సాఫీగా సాగుతున్న క్రమంలో తీక్షణ 10వ ఓవర్లో హెడ్ను ఔట్ చేయడంతో రెండో వికెట్కు 60 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. హైదరాబాద్ బ్యాటర్లను నిలువరించేందుకు చెన్నై కెప్టెన్ రుతురాజ్ బౌలర్లను మార్చిమార్చి ప్రయోగించినా లాభం లేకపోయింది.
టాస్ గెలిచిన సన్రైజర్స్ హైదరాబాద్..చెన్నైని బ్యాటింగ్కు ఆహ్వానించింది. ఢిల్లీతో గత మ్యాచ్ ఓటమి నుంచి ఇంకా పూర్తిగా తేరుకుని చెన్నై..తమ ఇన్నింగ్స్ను మందకోడిగా ప్రారంభించింది. దీనికి తోడు హైదరాబాద్ బౌలర్లు ఆది నుంచే తమదైన రీతిలో ఒత్తిడి పెంచుకుంటూ పోవడం కలిసి వచ్చింది. లీగ్లో మంచి ఫామ్మీదున్న ఓపెనర్ రచిన్ రవీంద్ర, కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్(26) జట్టుకు మెరుగైన శుభారంభాన్ని అందించలేకపోయారు. రహానేతో కలిసి శివమ్ దూబే..హైదరాబాద్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. షాబాజ్ను లక్ష్యంగా చేసుకుంటూ భారీ సిక్స్తో పాటు ఫోర్ బాదాడు. ఓ ఎండ్లో దూబే బౌండరీలతో విజృంభిస్తే..మరో ఎండ్లో రహానే చక్కని సహకారం అందించాడు. జైదేవ్ ఉనద్కత్ పరుగులను నియంత్రించడం రైజర్స్కు కలిసొచ్చింది. అప్పటికే మంచి ఊపులోకి వచ్చి ప్రమాదకరంగా మారుతున్న దూబేను కమిన్స్ ఔట్ చేశాడు. ఐపీఎల్లో కమిన్స్కు ఇది 50వ వికెట్. దీంతో మూడో వికెట్కు 39 బంతుల్లో 65 పరుగుల భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. అప్పటికే పరుగుల రాక మందగించి ఒత్తిడిలో ఉన్న చెన్నై..ఉనద్కత్ బౌలింగ్లో రహానే వికెట్ కోల్పోవడంతో మరింత కష్టాల్లో పడింది. ఇదే అదనుగా హైదరాబాద్ తమ బౌలింగ్తో మరింత ఒత్తిడి పెంచడం కలిసొచ్చింది.
ఈ సీజన్లో తెలుగు యువ క్రికెటర్ నితీశ్కుమార్రెడ్డికి రైజర్స్ అవకాశం ఇచ్చింది. 2024లో మంచి ఫామ్మీదున్న క్లాసెన్(10 నాటౌట్)తో కలిసి నితీశ్(14 నాటౌట్) జట్టును గెలుపు తీరాలకు చేర్చా డు. దీపక్ చాహర్ 19వ ఓవర్లో తొలి బంతికే సిక్స్ కొట్టి నితీశ్..రైజర్స్కు సొంతగడ్డపై వరుసగా రెండో విజయాన్ని అందించాడు.
చెన్నై: 20 ఓవర్లలో 165-5(దూబే 45, రహానే 35, భువనేశ్వర్ 1-28, జైదేవ్ 1-29),
హైదరాబాద్: 18.1 ఓవర్లో 166-4(మార్క్మ్ 50, అభిషేక్ 37, అలీ 2-23, తీక్షణ 1-27)