న్యూఢిల్లీ: చైనా వేదికగా జరిగే ప్రతిష్ఠాత్మక ఆసియా గేమ్స్ కోసం అఖిల భారత ఫుట్బాల్ సమాఖ్య(ఏఐఎఫ్ఎఫ్) 17 మందితో బుధవారం జట్టును ప్రకటించింది. స్టార్ స్ట్రైకర్ సునీల్ ఛెత్రీ భారత జట్టుకు నాయకత్వం వహిస్తుండగా, ఎంపికైన వారిలో చాలా మంది అంతగా అనుభవం లేని ప్లేయర్లే ఉన్నారు.
ఈ నెల 21 నుంచి ఐఎస్ఎల్ మొదలవుతున్న నేపథ్యంలో చాలా క్లబ్లు జాతీయ జట్టు ప్లేయర్లను తమ వద్దే అట్టిపెట్టుకోవడంతో ఏఐఎఫ్ఎఫ్ ద్వితీయ శ్రేణి ప్లేయర్లను ఎంపిక చేయాల్సి వచ్చింది. మరోవైపు చీఫ్ కోచ్ ఇగోర్ స్టిమాక్ ప్రాతినిధ్యంపై కూడా సందిగ్ధత కొనసాగుతున్నది.