మొరాకో: ఏటీపీ గ్రాండ్ ప్రి హసన్-2 టోర్నీలో భారత సీనియర్ టెన్నిస్ ప్లేయర్ యుకీ బాంబ్రీ, ఫ్రెంచ్ ఆటగాడు అల్బానో ఒలివెట్టి ద్వయం క్వార్టర్స్కు చేరుకుంది. బుధవారం జరిగిన పురుషుల ప్రిక్వార్టర్స్లో బాంబ్రీ-అల్బానో జోడీ 6-3, 6-4 తేడాతో బార్ట్ స్టీవెన్స్(డచ్)-పెట్రొస్ సిట్సిపస్ (గ్రీక్)ద్వయంపై గెలిచింది.
పురుషుల సింగిల్స్లో భారత స్టార్ ఆటగాడు సుమిత్ నాగల్ పోరాటం ప్రిక్వార్టర్స్లోనే ముగిసింది. 95వ ర్యాంకర్ నాగల్ 6-1, 3-6, 4-3 తేడాతో ఇటలీకి చెందిన నాలుగో సీడ్ లొరెంజో సొనెగో చేతిలో చిత్తయ్యాడు. తొలి సెట్లో గెలిచినప్పటికీ నాగల్ తర్వాత తన జోరును కొనసాగించలేక చతికిలపడ్డాడు.