Cyclone Michaung: పశ్చిమ మధ్య బంగాళఖాతంలో ఏర్పడిన మిచౌంగ్ తుఫాను కారణంగా తమిళనాడు రాజధాని చెన్నై నగరం అతలాకుతలమవుతోంది. చెన్నై నగరంలో కురుస్తున్న వర్షాలకు రహదారులు జలాశయాలను తలపిస్తున్నాయి. విమాన, రైలు సర్వీసులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో పలువురు క్రికెటర్లు చెన్నై ప్రజలకు మద్దతుగా నిలుస్తున్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడే లంక యువ క్రికెటర్లు మతీశ పతిరాన, మహీశ్ తీక్షణలు తమిళ ప్రజలకు సంఘీభావం ప్రకటించారు.
ట్విటర్ వేదికగా పతిరాన స్పందిస్తూ.. “నా చెన్నై, సేఫ్గా ఉండు. ఈ తుఫాను మనల్ని భయపెట్టొచ్చు గానీ మనం త్వరగా పుంజుకుంటాం. మంచిరోజులు త్వరలోనే ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. ఇంట్లోనే ఉండండి. ఒకరికొకరు తోడుగా నిలవండి..” అని ట్వీట్ చేశాడు.
Stay safe, my Chennai! The storm 🌪️ may be fierce, but our resilience is stronger. Better days are just around the corner. Take care, stay indoors, and look out for one another 💛💛💛 #yellove #ChennaiWeather #StaySafe #ChennaiRains #CycloneMichaung https://t.co/ovbsziy7gv
— Matheesha Pathirana (@matheesha_9) December 4, 2023
తీక్షణ స్పందిస్తూ… “నా రెండో ఇంటి (చెన్నై)ని చూస్తే ఆందోళనగా ఉంది. చెన్నై త్వరగా కోలుకోవాలని నేను ప్రార్థిస్తున్నాను..” అని ట్వీట్ చేశాడు.
😢 Just watched some concerning footage from my second home 🏡, Chennai. Sending all my love and prayers to everyone affected. Stay strong, stay safe. We’re in this together. 🙏💛💛💛☁️🌪️ #yellove #StaySafeChennai #CycloneMichaung https://t.co/niA7m1H4tI
— Maheesh Theekshana (@maheesht61) December 4, 2023