ITF Tourney | హైదరాబాద్, ఆట ప్రతినిధి: నాగ్పూర్ ఐటీఎఫ్ టోర్నీలో రాష్ట్ర యువ ప్లేయర్ సహజ యమ్లపల్లి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్ పోరులో సహజ 6-2, 6-1తో సోనాల్ పాటిల్పై అలవోక విజయం సాధించింది. ఆది నుంచే తనదైన జోరు కనబరిచిన సహజ..ప్రత్యర్థికి ఎక్కడా అవకాశమివ్వకుండా వరుస సెట్లలో మ్యాచ్ను కైవసం చేసుకుంది.
తదుపరి రౌండ్లో డియోన్ బ్యాక్(దక్షిణకొరియా)తో తలపడుతుంది. మరోవైపు మహిళల డబుల్స్ క్వార్టర్స్లో శ్రీవల్లి రష్మిక, వైదేహి చౌదరి జోడీ 6-2, 7-6తో రెండో సీడ్ ద్వయం ఫ్యానీ ఔస్ట్ల్యాండ్, యక్టరీనా యశీనాపై గెలిచి సెమీస్లోకి ప్రవేశించింది.