కల్గరీ: కెనడా బ్యాడ్మింటన్ ఓపెన్లో రాష్ర్టానికి చెందిన పంజాల విష్ణువర్ధన్గౌడ్ ఆకట్టుకున్నాడు. గార్గ కృష్ణప్రసాద్తో కలిసి విష్ణువర్ధన్ రెండో రౌండ్లోకి దూసుకెళ్లారు. బుధవారం జరిగిన పురుషుల డబుల్స్ తొలి రౌండ్ పోరులో భారత ద్వయం విష్ణు, కృష్ణప్రసాద్ 21-14, 21-16తో చైనీస్ తైపీ జోడీ చెన్ జీరే, లు చెన్పై అద్భుత విజయం సాధించింది.
తొలి గేమ్ నుంచే జోరు ప్రదర్శించిన భారత ద్వయం ప్రత్యర్థిని మట్టికరిపించి టోర్నీలో శుభారంభం చేసింది. తదుపరి రౌండ్లో రెండో సీడ్ మహమ్మద్ అహసాన్, హెండ్రా సెతివాన్తో వీరు తలపడే అవకాశముంది. మరోవైపు పురుషుల సింగిల్స్లో పారుపల్లి కశ్యప్ 17-21, 20-22తో లీ లాన్ జీ(చైనా)చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించాడు.