ముషీరాబాద్: సౌత్ ఏషియా కరాటే చాంపియన్షిప్లో రాష్ర్టానికి చెందిన గంగిశెట్టి నిశిత పసిడి పతకంతో మెరిసింది. శ్రీలంకలో జరిగిన ఆరో సౌత్ ఏషియా కరాటే చాంపియన్షిప్లో మహిళల జూనియర్ 53కిలోల కుమిటే కేటగిరీలో నిశిత అద్భుత ప్రదర్శన కనబరిచింది. ఈ విభాగంలో పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్కు చెందిన ప్లేయర్లను నిశిత ఓడించి ముందంజ వేసింది. టోర్నీలో స్వర్ణంతో రాణించిన నిశితను కాలేజీ యాజమాన్యం అభినందించింది.