హైదరాబాద్, ఆట ప్రతినిధి: హుస్సేన్సాగర్ వేదికగా జరుగుతున్న వైఏఐ మాన్సూన్ రెగెట్టా జాతీయ ర్యాంకింగ్ చాంపియన్షిప్లో రాష్ర్టానికి చెందిన ధరణి లావేటి, వడ్ల మల్లేశ్, కొమురవెల్లి దీక్షిత అదరగొట్టారు. బుధవారం జరిగిన అండర్-19 ఇంటర్నేషనల్ 420 క్లాస్ కేటగిరీలో వైసీహెచ్ తెలంగాణకు చెందిన ధరణి, మల్లేశ్ 9 పాయింట్లతో అగ్రస్థానం దక్కించుకున్నారు. మరోవైపు అండర్-15 బాలికల ఆప్టిమిస్టిక్ క్లాస్ విభాగంలో దీక్షిత 28 పాయింట్లతో టాప్లో నిలిచింది. బాలుర విభాగంలో ఏకలవ్య, శరణ్య యాదవ్, అకాశ్ తంగై తొలి మూడు స్థానాలు దక్కించుకున్నారు.