Samhita Pungavanam | హైదరాబాద్, ఆట ప్రతినిధి: మలేషియా వేదికగా జరిగిన కామన్వెల్త్ చాంపియన్షిప్లో రాష్ట్ర యువ చెస్ ప్లేయర్ సంహిత పుంగవనం కాంస్య పతకంతో మెరిసింది. బాలికల అండర్-10 విభాగంలో పోటీకి దిగిన సంహిత 7/9 స్కోరుతో ఆకట్టుకుంది.
ప్రత్యర్థులకు దీటైన పోటీనిచ్చిన సంహిత మెరుగైన ప్రదర్శన కనబరిచింది.