హైదరాబాద్, ఆట ప్రతినిధి: వరల్డ్ టూర్ టెన్నిస్ ఐటీఎఫ్ టోర్నీలో రాష్ట్ర యువ ప్లేయర్ సాయికార్తీక్రెడ్డి, మనీశ్ సురేశ్కుమార్ జోడీ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. గురువారం జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్స్లో కార్తీక్, మనీశ్ ద్వయం 6-3, 6-4తో రాఘవ్ సింఘానియా, రిషిరెడ్డి జోడీపై అలవోక విజయం సాధించింది.