హైదరాబాద్, ఆట ప్రతినిధి: జాతీయ సబ్ జూనియర్ అక్వాటిక్ చాంపియన్షిప్లో రాష్ట్ర స్విమ్మర్ కర్రా శివాని అదరగొట్టింది. ఇప్పటికే మూడు పతకాలు ఖాతాలో వేసుకున్న శివాని.. ఆదివారం చాంపియన్షిప్ చివరి రోజు పోటీల్లో మరో స్వర్ణం కైవసం చేసుకుంది. 100 మీటర్ల బ్యాక్స్ట్రోక్లో శివాని 1:15.87 సెకన్లలో లక్ష్యాన్ని చేరి అగ్రస్థానంలో నిలిచింది. శ్రియ (1:17.8 సె., కేరళ), అన్వి (1:18.84 సె., మహారాష్ట్ర) వరుసగా రజత కాంస్యాలు దక్కించుకున్నారు. ఈ చాంపియన్షిప్లో శివాని రాష్ట్రం తరఫున రెండు స్వర్ణాలు, ఒక రజతం, ఓ కాంస్యం కైవసం చేసుకుంది. ఆరేండ్ల వయసు నుంచే స్విమ్మింగ్పూల్లో సంచలనాలు సృష్టిస్తున్న శివాని ప్రస్తుతం గచ్చిబౌలి స్టేడియంలో కోచ్ ఆయూష్ యాదవ్ దగ్గర శిక్షణ తీసుకుంటున్నది. ఆరో తరగతి చదువుతున్న శివాని భవిష్యత్లో మరిన్ని విజయాలు సాధించాలన్న పట్టుదలతో ఉంది.