హైదరాబాద్, ఆట ప్రతినిధి: బెంగళూరు వేదికగా జరిగిన టీఎస్జీ సౌత్జోన్ గోల్ఫ్ చాంపియన్షిప్లో రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల గోల్ఫర్లు అదరగొట్టారు. రెండు రోజుల పాటు జరిగిన టోర్నీలో గురుకులాలకు చెందిన ఇద్దరు గోల్ఫర్లు ముకుల్కుమార్(న్యాల్కల్) రజత పతకంతో మెరువగా, అమూల్య(తొర్రూరు) కాంస్య పతకం ఖాతాలో వేసుకుంది. ప్రత్యర్థి ప్లేయర్లకు దీటైన పోటీనిస్తూ ముందుకు సాగిన వీరిద్దరు సత్తాచాటారు. పతకాలు సాధించిన ముకుల్, అమూల్యను గోల్ఫ్ కోచ్ భాస్కర్, సత్యనారాయణ, నందిని, సురేశ్ అభినందించారు.