హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ఆలిండియా పోలీస్ స్పోర్ట్స్ మీట్లో రాష్ట్ర పోలీస్లు రెండు రజతాలు, రెండు కాంస్య పతకాలతో అదరగొట్టారు. జగిత్యాల డీఏఆర్కు చెందిన ఆర్ఐ సైదులు 47మీటర్ల విభాగంలో రజతం, ఓపెన్ నేషనల్ షూటింగ్ చాంపియన్షిప్ 50మీటర్ల ర్యాపిడ్ ఫైర్ విభాగంలో మరో రతజం సొంతం చేసుకున్నాడు. 8వ బెటాలియన్కు చెందిన అసిస్టెంట్ కమాండెంట్ నారాయణదాసు జాతీయ ఓపెన్ షూటింగ్ 25మీటర్ల ర్యాపిడ్ ఫైర్లో రజతం సొంతం చేసుకున్నాడు. వరంగల్కు చెందిన సువర్ణ..50మీటర్ల రైఫిల్ విభాగంలో వెండి పతకం దక్కించుకుంది. ఈ సందర్భంగా డీజీపీ అంజనీకుమార్, వెల్ఫేర్-స్పోర్ట్స్ ఏడీజీ అభిలాష బిస్త్ పతక విజేతలను సోమవారం అభినందించారు. ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ డీఎస్పీ రామారావు, టీఎస్పీఏ కమాండెంట్ పీఎస్ఆర్ మూర్తి, వీ3 క్రీడా విభాగానికి చెందిన సూపరింటెండెంట్ రాజేందర్ పాల్గొన్నారు.