హైదరాబాద్, ఆట ప్రతినిధి: రాష్ట్ర స్థాయి పవర్లిఫ్టింగ్ టోర్నీలో రంగారెడ్డి జిల్లా జట్టు ఓవరాల్ చాంపియన్షిప్ దక్కించుకుంది. పురుషుల విభాగంలో విజేతగా నిలిచిన రంగారెడ్డి మహిళల కేటగిరీలో రన్నరప్ కైవసం చేసుకుంది. హైదరాబాద్, ఖమ్మం జట్లు ద్వితీయ, తృతీయ స్థానాలను సొంతం చేసుకున్నాయి.
సీనియర్ పవర్లిఫ్టర్ ప్రకాశ్ బిడ్లాన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ టోర్నీలో రంగారెడ్డి జట్టు అద్భుత ప్రదర్శన కనబరిచింది. రాష్ట్ర పవర్లిఫ్టింగ్ అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ రమేశ్గౌడ్ రంగారెడ్డి టీమ్కు ట్రోఫీ అందజేశారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు అనిల్కుమార్, ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణగౌడ్, ప్రవీణ్, కోచ్ ఆనంద్రాజ్ తదితరులు పాల్గొన్నారు.