హనుమకొండ చౌరస్తా: వరంగల్ జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎనిమిదవ రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్ టోర్నీ హోరాహోరీగా సాగుతున్నది. సుబేదారి వరంగల్ క్లబ్లో పోటీలను పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి గురువారం ప్రారంభించారు. రాష్ట్రం నలుమూలల నుంచి 165 మంది ప్లేయర్లు సింగిల్స్, డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ విభాగాల్లో తలపడ్డారు. అలాగే వెటరన్స్ విభాగాల(65+, 70+, 75+) ప్లేయర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇందులో ఎంపికైన క్రీడాకారులు డిసెంబర్లో భువనేశ్వర్లో జరిగే జాతీయ స్థాయి టోర్నీలో పోటీకి దిగుతారని జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు రమేశ్కుమార్, కార్యదర్శి రమేశ్రెడ్డి పేర్కొన్నారు. బాలుర విభాగంలో రామ్, ధృవ్, అలీ సిద్ధికి, క్రిష్ భార్గవ్, ఆమిర్ ఆసిమ్ గెలిచారు.