హనుమకొండ చౌరస్తా : వరంగల్ జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జవహర్లాల్ నెహ్రూ స్టేడియం వేదికగా రాష్ట్ర స్థాయి 9వ ఫెడరేషన్ కప్ అథ్లెటిక్స్ టోర్నీ శనివారం ప్రారంభమైంది. పోటీల తొలి రోజు ఖమ్మం జిల్లా అథ్లెట్లు రెండు స్వర్ణాలు, మూడు కాంస్య పతకాలు సొంతం చేసుకున్నారు.
పురుషుల 400మీటర్ల పరుగు పందెంలో హనుమకొండకు చెందిన కార్తీక్ పసిడి పతకంతో మెరిశాడు. లాంగ్జంప్లో పరుశరామ్కు రజతం, హ్యుమర్త్రోలో నగేశ్కు, డిస్కస్త్రోలో మధుకర్కు రజత పతకాలు దక్కాయి. పురుషుల 100మీటర్ల రేసులో పాషాకు పసిడి, మైథిలి స్వర్ణం దక్కింది.