జనగామ చౌరస్తా: జనగామ జిల్లా కేంద్రంలోని బతుకమ్మ కుంటలో రాష్ట్ర స్థాయి కబడ్డీ చాంపియన్షిప్ పోటీలు మంగళవారం మొదలయ్యాయి. జిల్లా కలెక్టర్ శివలింగయ్య, వరంగల్ సీపీ తరుణ్ జోషి..పోటీలను అధికారికంగా ప్రారంభించారు. ఈనెల 9వరకు జరిగే టోర్నీలో ఉమ్మడి పది జిల్లాల నుంచి మొత్తం 15 జట్లు జనగామకు చేరుకున్నాయి. తొలి రోజు వరంగల్, ఆదిలాబాద్ (పురుషుల), డీసీసీ వెస్ట్జోన్, వర్ధన్నపేట ఏసీసీ (మహిళల) జట్లు తలపడ్డాయి. ఈ టోర్నీలో విజేతలకు ట్రోఫీతో పాటు రూ.60 వేల నగదు, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన జట్లకు వరుసగా రూ.40వేలు, రూ.20 వేలు ఇవ్వనున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. టోర్నీలో బరిలోకి దిగుతున్న ప్లేయర్లు, అధికారులకు పూర్తిస్థాయి ఏర్పాట్లు చేశారు.