న్యూఢిల్లీ: కండరాల గాయంతో బాధపడుతున్న స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా…ఈ నెల 30 నుంచి మొదలయ్యే లూసానే డైమండ్ లీగ్లో బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం గాయం నుంచి కోలుకుంటున్న నీరజ్.. డైమండ్ లీగ్ ఆరో దశలో తిరిగి పోటీపడే చాన్స్ ఉంది.
అయితే ఈ ఒలింపిక్ చాంపియన్ నుంచి పూర్తి స్పష్టత రానప్పటికీ..అధికారిక వెబ్సైట్లో నీరజ్ బరిలోకి దిగుతున్నట్లు ఉంది. ఒక వేళ నీరజ్ పోటీకి దిగితే జాకమ్ వాల్దెచ్ (చెక్ రిపబ్లిక్), జులిన్ వెబర్ (జర్మనీ) నుంచి దీటైన పోటీ ఎదురవడం ఖాయంగా కనిపిస్తున్నది. కండరాల గాయం కారణంగా ఎఫ్బీకే గేమ్స్ (నెదర్లాండ్స్)తో పాటు పావో నుర్మీ (ఫిన్లాండ్) టోర్నీల నుంచి చోప్రా తప్పుకున్నాడు.