దుబాయ్: టీమ్ఇండియా స్టార్ క్రికెటర్ స్మృతి మందన వన్డే ర్యాంకింగ్స్లో నాలుగో ర్యాంక్కు చేరుకుంది. మంగళవారం విడుదలైన తాజా ర్యాంకింగ్స్లో మందన 696 పాయింట్లతో రెండు ర్యాంక్లు మెరుగుపర్చుకుని నాలుగులో నిలిచింది. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్లో మందన 31.50 సగటుతో 63 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బ్యాటర్ నటాలీ స్కీవర్(807) నంబర్వన్ ర్యాంక్లో కొనసాగుతున్నది. బౌలింగ్ ర్యాంకింగ్స్లో దీప్తిశర్మ(654) నాలుగో ర్యాంక్లో ఉండగా, సోఫీ ఎకల్స్టోన్(746) అగ్రస్థానంలో ఉంది.